Vijayashanthi:సీనియర్ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ అని చాలామంది హీరోయిన్లను ఇప్పుడు పిలుస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతినే. హీరోలుగా ధీటుగా ఆమె సినిమాలు హిట్స్ అందుకొనేవి. హీరో లేకుండా ఒక సినిమాను సూపర్ హిట్ చేయగలిగిన సత్తా ఆమెలో ఉంది.
ఒక పక్క స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేస్తూనే.. ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సంచలనం సృష్టించింది. ఇక కొన్నేళ్ల తరువాత సినిమాలకు దూరం అయిన విజయశాంతి రాజకీయాల్లో కొనసాగుతోంది. చాలా గ్యాప్ తరువాత ఆమె సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కథ నచ్చితే తప్పకుండా సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చిన విజయశాంతి.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే విజయశాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అప్పట్లో ఆమె.. చిరంజీవి, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే నిప్పురవ్వ సినిమా తరువాత బాలకృష్ణతో సినిమాలు చేయలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయని, వారిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు విజయశాంతి చెక్ పెట్టింది. నిప్పురవ్వ సినిమా తరువాత బాలయ్యతో చేయకపోవడానికి కారణం.. కేవలం డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమే అన్ని, వేరే కారణాలు ఏమి లేవని తెలిపింది. ” బాలకృష్ణతో నిప్పురవ్వ తరువాత నేను నటించలేదు. ఆయనతావు నటించకపోవడానికి వేరే కారణం అంటూ ఏమి లేదు. అప్పటికే నేను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఆ సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే నేను నటించలేకపోయాను. అప్పుడు నేను తీసుకున్నరెమ్యూనిరేషన్ కూడా ఎక్కువ. అలాంటి సినిమాలతో హీరో ఇమేజ్ వస్తుందనీ, నేను యాక్షన్ సినిమాలు చేస్తాననీ.. అంతలా బిజీ అవుతానని నేనే అనుకోలేదు. అందువల్లనే ఇక వేరే హీరోలతో చేయలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చింది.