శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రెస్ మీట్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు కోటి రూపాయల విలువైన గంజాయిని హైదరాబాద్ నుండి బెంగళూరుకు కంటైనర్ లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి కళ్ళు కప్పి బెంగళూరుకు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లును అరెస్ట్ చేశారు.
బెంగుళూరులో కొత్త సంవత్సర వేడుకల కోసం భారీ ఎత్తున గంజాయి తీసుకెళ్తున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా స్మగ్లర్లు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న చిలమత్తూరు పోలీసులను ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు.