Ys Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి గవర్నర్కు వివరించనున్నట్లు సమాచారం. అలాగే ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇక పాదయాత్రలో భాగంగా 4 గంటలకు షర్మిల లింగగిరి గ్రామప్రజలతో మాట్లాడనున్నారు. 4.30 గంటలకు సూరిపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తొప్పనగడ్డ తాండా ప్రజలతో ముచ్చటించి.. 5.30 గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.