EPAPER

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు.


అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం. అలాగే ప్రజల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక పాదయాత్రలో భాగంగా 4 గంటలకు షర్మిల లింగగిరి గ్రామప్రజలతో మాట్లాడనున్నారు. 4.30 గంటలకు సూరిపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తొప్పనగడ్డ తాండా ప్రజలతో ముచ్చటించి.. 5.30 గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×