Telangana news updates : అతనో డిగ్రీ స్టూడెంట్. ఆ ఏజ్ యూత్ అందరిలానే క్రికెట్ అంటే పిచ్చి. చూడటం, ఆడటం వరకు పరిమితమైతే బాగుండేది. కానీ, ఫ్రెండ్స్ ప్రభావంతో పక్కదారి పట్టాడు. బెట్టింగ్ పెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇంకేం. మొత్తం ఖల్లాస్.
వచ్చేది తక్కువ. పోయేది బోలెడు. పోయిన మొత్తాన్ని మళ్లీ రికవరీ చేసేందుకు మళ్లీ బెట్టింగ్. డబ్బులు లేకపోతే అప్పు చేసి మరీ బెట్టింగ్ ఆడేవాడు. అలా అలా.. ఏకంగా 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఐపీఎల్ ముగియడంతో.. అప్పులు మిగిలాయి. అప్పటి నుంచి అప్పు ఇచ్చినవాళ్ల నుంచి ప్రెజర్ పెరిగింది. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మురళి సూసైడ్ చేసుకున్నాడు.
మురళీ ఢిల్లీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. గత నెల 24న స్వస్థలం పాపన్నపేట మండలం పోడ్చన్పల్లి తండాలోని ఇంటికి వచ్చాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తండా శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానానికి వస్తాడనుకున్న మురళి.. ఇలా క్రికెట్ బెట్టింగ్స్తో అప్పులపాలై.. ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.