Yennam Srinivas Reddy Serious on BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. ‘పీఏసీ కమిటీలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చెందని వ్యక్తులు లేరు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మేడిగడ్డ బ్యారేజీలో కమీషన్లు తిన్నారు. మళ్లీ ఈరోజు పీఏసీ చైర్మన్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత బీఆర్ఎస్ లో జరిగిన అక్రమాలను, కుంభకోణాల వివరాలను ప్రజల ముందు పెడుతాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.