EPAPER

Yashaswini Reddy : అత్త శపథం.. కోడలు విజయం..

Yashaswini Reddy : అత్త శపథం.. కోడలు విజయం..

Yashaswini Reddy : మామిడాల యశస్విని రెడ్డి.. తెలంగాణలో మారుమోగుతున్న పేరు ఇది. ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు మీద ఆమె విజయ దుందుభి మోగించారు. ఇరవై ఆరేళ్ల వయసున్న యశస్విని రెడ్డి.. దయాకర్ రావు రాజకీయ జీవితానికి చెక్ పెట్టారని చెప్పొచ్చు.


అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బిగ్ టీవికి ఇచ్చిన ఇంటర్వూలో తన అనుభవాలను పంచుకున్నారు. తన అత్త ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రానందున ఆమె రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని యశస్విని తెలిపారు. పౌరసత్వం రాకుండా అడ్డుకున్నారు కానీ వారసత్వాన్ని అడ్డుకోలేరు అని స్పష్టం చేశారు. తన కుటుంబం అంతా ప్రజాసేవకే అంకింతం అని చెప్పారు.

పాలకుర్తి ప్రజల ఆశయాల కోసం పాటుపడతానని.. వాళ్ల అభివృద్ధే తన లక్ష్యం అని పేర్కొన్నారు. మళ్లీ తిరిగి విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. పాలకుర్తి ప్రజల బాధలు దగ్గర నుండి చూసేసరికి చలించిపోయానని అన్నారు. తన ఆలోచన అంతా పాలకుర్తి ప్రజల అభివృద్ది గురించేనని స్పష్టం చేశారు.


దగాకోరు దయాకర్ రావు వల్ల పాలకుర్తి ప్రజాలు చాలా ఇబ్బంది పడ్డారని.. 15 ఏళ్ల బాధని ఐదేళ్లలో తీరుస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. అలాగే తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పాలకుర్తి ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయమని అన్నారు.

.

.

Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×