Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతా రెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు గీతారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు దేవాదాయ కమిషనర్ ఆదేశాలతో రిజైన్ చేశారు .