Yadadri Temple Collection : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు….మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం వచ్చింది. ఈ మేరకు ఆలయ ఈవో అధికారిక ప్రకటన చేశారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు కోటి రూపాయలకు పైగా ఆదాయం చేరింది. కానుకలు, పూజాది కార్యక్రమాల రూపంలో మొత్తం కలుపుకుని …. కోటి 16 లక్షల 13 వేల 977 రూపాయలు వచ్చిందని ఈవో వెల్లడించారు. దర్శన టికెట్ల నుంచి 18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా 44.37 లక్షలు, కొండపైకి వచ్చిన వాహనాల ద్వారా 9.75 లక్షలు, తలనీలాల ద్వారా 1.78 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు.