Mancherial Incident(TS news updates) : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఓ భర్త.. తన భార్యను హత్య చేశాడు. నచ్చిన కూర వండలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపాడు.
కిష్టంపేట గ్రామానికి చెందిన గాలిపెల్లి పోశం.. తాగుడుకు బానిసై భార్య శంకరమ్మతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి తనకు నచ్చిన కూర వండలేదంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న శంకరమ్మను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.