యూట్యూబ్ ద్యారా తెలుసుకున్న జ్యోతిష్యం ప్రకారం.. తాను- తన భర్త విడిపోతామని బలంగా నమ్మి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని అంబర్పేటకు చెందిన బబిత అనే యువతికి ఐదేళ్లక్రితం బాలంరాయికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో వివాహం జరిగింది. వీరిద్దరూ కానాజిగూడ ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బబిత తల్లిదండ్రులు తప్ప బంధుమిత్రులంతా హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్లాడు. రెండుగంటలకు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూశాడు. కింది పోర్షన్లో ఉన్న బాబాయికి వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రామకృష్ణ పై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్తింటివారు తెలిపిన వివరాల ప్రకారం.. బబితకి జ్యోతిష్య మంటే ఎంతో నమ్మకం. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితను రామకృష్ణ పదేపదే కోరేవాడు. దీనిపై ఇటీవల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందరి ముందు రామకృష్ణ ఆమెను కొట్టాడు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.