Hyderabad : అప్పులు తీర్చలేదని భర్యా, భర్తలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో కలకలం రేపింది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఫిలిం నగర్లోని సత్య కాలనీలో ఖాద్రీ, ఫాతిమా దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజులుగా ఫాతిమా తన సోదరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా.. ఫాతిమా ఊరివేసుకోని చనిపోయింది. పిల్లలు పుట్టకపోవడంతో ఫాతిమాని చంపి ఖాద్రి పాడిపోయారని ఫాతిమా చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దంపతుల ఇంటి పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ నీ పోలీసులు పరిశీలించారు. ఫాతిమాని చంపి ముగ్గురు బయటికి వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునీ ప్రశ్నించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూడు ఏళ్ల క్రితం ముంబైకి చెందిన వ్యాపారుల దగ్గర్నుంచి ఖాద్రి, ఫాతిమాలు మేకల వ్యాపారం కోసం 20 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. మూడేళ్లుగా అప్పు చెల్లించకుండా దంపతులు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు.
ఈ నెల రెండో తేదీన వ్యాపారులు హైదరాబాదుకు వచ్చి టోలిచౌక్లో ఆశ్రయం తీసుకున్నారు. మూడో తేదీన వ్యాపారులు ఖాద్రిని కిడ్నాప్ చేసి హత్య చేసి పాతిపెట్టారు. ఫాతిమా కిడ్నాప్ విషయం బయటపెడుతుందని మరుసటి రోజు వ్యాపారులు ఇంటికి వెళ్లారు. ఫాతిమాకి ఊరివేసి చంపేశారు. గ్యాస్ లీక్ చేసి వ్యాపారులు అక్కడి నుంచి పారిపోయారు. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు చేశారు.