Modi: తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఆసక్తిగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారంతో రాజకీయం హస్తిన చేరింది. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎపిసోడ్ కాషాయ పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. నేరుగా పార్టీ అధిష్టాన్నే టార్గెట్ చేస్తూ రఘునందన్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా తెలంగాణ బీజేపీలో ముసలం రగులుతున్న వేళ ప్రధాని వరంగల్ రానున్నారు.
ఈనెల 8న వరంగల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన తుది షెడ్యూల్ ఖరారైంది. ఈ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరతారు. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 9.50 గంటలకు హెలికాప్టర్లో వరంగల్కు వెళతారు. ఉదయం 10.35 గంటలకు వరంగలో దిగుతారు.
వరంగల్ ఉదయం 10.45 నుంచి 11.20 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేస్తారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు వరకు బహిరంగసభలో పాల్గొంటారు. వేదికపై మోదీ ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు వరంగల్ నుంచి తిరిగి హెలికాప్టర్లో బయల్దేరతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో రాజస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ వెళతారు.