Vikarabad latest news(TS today news):
ఓటరు జాబితాలో వంద మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరు ఒక్కటే వచ్చింది. అత్యధిక జనాభా ఉన్న వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్కోట పంచాయతీలో ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు వచ్చాయి. పోలింగ్ కేంద్రం సంఖ్య 76లో వంద మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా నమోదైంది.
ఎంపీటీసీ సభ్యుడు రాజ్కుమార్, కాంగ్రెస్ నాయకుడు జర్నప్ప ఈ తప్పులను సరిచేయాలని తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని అన్నారు. కార్మికుల కాలనీ, ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలోని తప్పులను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు.