EPAPER

Vote from Home : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్.. ఇంటినుంచే ఓటేసిన ఓటర్లు

Vote from Home : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్.. ఇంటినుంచే ఓటేసిన ఓటర్లు
election news in telangana

Vote from Home(Election news in Telangana) :

వృద్ధులకు, వికలాంగులకు ఓటు వేయడానికి ఇంటిదగ్గర అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. వయోవృద్ధులు 80 ఏళ్లు దాటిన వారు, వికలాంగులు నడవలేని వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు ఇంటి దగ్గర ఓటేసే సదుపాయాన్ని కల్పించింది.


సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలో 80 ఏళ్లు దాటిన రాజయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 28 మంది ముందుగా దరఖాస్తులు చేసుకోగా 21 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంటి దగ్గరికి బ్యాలెట్ బాక్స్ ఈవీఎం ను ఎన్నికల సామాగ్రి తరలించి. ఎన్నికల సంఘం జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఓటు హక్కు కల్పించారు.

గతంలో ఓటు వేయాలంటే.. వృద్ధులు, వికలాంగులు వీల్ చైర్స్ లో రావలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు.. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు ఫారం డి-12ను సమర్పిస్తే.. ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు. ఇంటికి వచ్చే ముందు పోలింగ్ సిబ్బంది సమాచారం ఇస్తారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తే.. వాటిని సేకరించి పోలింగ్ సిబ్బంది తీసుకెళ్తారు. తెలంగాణలో మొత్తం 28,057 మంది వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


.

.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×