Vikram Goud : తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ముకేష్గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తండ్రి ముకేష్గౌడ్ 2009లో కాంగ్రెస్ తరఫున గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గం టికెట్ ఆశించి విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మరోసారి రాజాసింగ్కే గోషామహల్ లో అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. తనకు అవకాశం రాకపోవడం అలకబూనిన విక్రమ్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో కొత్తవారిని అంటరానివారిగా చూస్తున్నారంటూ సంచలన ఆరోోపణలు చేశారు. బీజేపీ కోసం తాను ఏమీ ఆశించకుండా పనిచేశానని.. అయినా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రూపు రాజకీయాల్లో భాగమైతేనే బీజేపీలో మనుగడ ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు విక్రమ్ గౌడ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి చాన్నాళ్లయినా.. పార్టీ ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన విక్రమ్ గౌడ్.. కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయ్యారు.
.
.