Vikarabad : ఆదిత్య 369 సినిమాలో గుండ్రని ఆకారంలో ఓ శకటం ఉంటుంది..సరిగ్గా దాన్ని పోలినట్లే ఉన్న శకటం ఆకాశంలోంచి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో పొలంలో వచ్చి పడింది. దీన్ని చూడటానికి గ్రామంలో అనేక మంది అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు.
అయితే ఇది టైమ్ మిషినో లేక ఏలియన్లకు సంబంధించినది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో ఉన్న మార్పులను కనుగొనడానికి బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దీన్ని భూమి ఉపరితలానికి పంపించారని సంబంధిత శాస్త్రవేత్తలు చెబుతున్నారు.