Vigilance DG Rajeev Ratan Died of Heart Attack: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడవగా.. ఆయన మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఉగాది పర్వదినాన ఉదయం సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కు ఒక్కసారిగా ఛాతినొప్పి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
ఐపీఎస్ రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. గతంలో రాజీవ్ రతన్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. దీంతో పాటుగా ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.
Also Read: AP IPS Raghuramreddy new posting: అస్సాంకు రఘురామ్రెడ్డి, జగన్కు షాకింగ్? అందుకోసమేనా?
ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి, పోలీస్ యంత్రాంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.