కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి బరిలో ఉన్నారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదాడ నియోజకవర్గానికి సరైన నిధులు రాలేదని ఆమె పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్ లను తొలగిస్తామని ఉత్తమ్ పద్మావతి తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.
స్ధానిక ఎమ్మెల్యే కనుసన్నలోనే డ్రగ్స్ దందా జరుగుతుందని.. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. కోదాడ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని ఆమె తెలిపారు. కోదాడలో కుల రాజకీయాలు లేవని.. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారని ఉత్తమ్ పద్మావతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు నచ్చాయని.. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని స్పష్టం చేశారు.