EPAPER

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Two die after bike rams bus: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Two die after bike rams bus: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనగర్‌లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.


రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందానగర్ వాసులుగా గుర్తించారు. మృతులు మనోజ్, రాజులు అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


చందానగర్ కు చెందిన గొలుసు మనోజ్(23), చిట్టిమల్ల రాజు(26) ఇద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళ్తున్నారు. అయితే చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యూటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.

బైక్ నడుపుతున్న మనోజ్ తోపాటు రాజు ఇద్దరు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×