Hyderabad : హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఐతే అగ్ని ప్రమాదానికి కారాణాలేంటనేది తెలియరాలేదు.ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఐతే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.