TSRTC Revenue | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంస్థకు లాభాలు వస్తున్నాయి.
TSRTC Revenue | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంస్థకు లాభాలు వస్తున్నాయి.
పథకం ప్రారంభమైన వారం రోజుల వరకు మహిళలందరూ ఎటువంగి గుర్తింపు కార్డులు చూపించకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. మహిళలు తెలంగాణ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ కార్డ్ చూపిస్తే బస్సు కండక్టర్ నుంచి జీరో టికెట్ పొందవచ్చు. తెలంగాణ వాసిగా గుర్తింపు కార్డు లేకపోతే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. లేకపోతే రూ.500 జరిమానా విధిస్తారు.
తెలంగాణ రాష్ట్రమంతా నిత్యం 13 లక్షల ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో ఉచిత పథకం కింద 80 శాతం వరకు మహిళలే ప్రయాణిస్తున్నారని సమాచారం. దీనివల్ల ఆర్టీసికి నష్టాలు వస్తాయని అందరూ భావించినా.. ఆ నష్టాన్ని ప్రభుత్వం రీఅంబర్స్ చేస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం జీరో టికెట్ లెక్కలు.. ప్రభుత్వానికి పంపితే ఆ మొత్తాన్ని రీయంబర్స్ మెంట్ ద్వారా తిరిగి వస్తుంది. ఉచిత టికెట్ పథకం మొదలైనప్పటి నుంచి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నవంబర్ నెల వరకు గణాంకాలు పరిశీలిస్తే.. ఆర్టీసీకి రోజుకు రూ. 13 లక్షల నుంచి రూ.14 లక్షల ఆదాయం రాగా.. పథకం ద్వారా 18-25 లక్షలకు పెరిగిందని అంచనా.