EPAPER
Kirrak Couples Episode 1

TSRTC News : ఆర్టీసీ విలీనం.. ఇంకా ఉంది.. గవర్నర్ దగ్గరే పెండింగ్!

TSRTC News : ఆర్టీసీ విలీనం.. ఇంకా ఉంది.. గవర్నర్ దగ్గరే పెండింగ్!
TSRTC News


TSRTC News : తెలంగాణలో ఆర్టీసీ బస్సు బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ ముందుకు కదలడంలేదు. బిల్లు ఆమోదానికి రాజ్‌భవన్‌ ఓకే చెప్పినప్పటికీ.. పాస్ అయిన బిల్లుపై గవర్నర్ ఇంకా సంతకం చేయకపోవడం మరోసారి రాజకీయ రచ్చకు కారణమైంది.

ధర్నాలు, చర్చల తర్వాత.. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్‌ చేసేసింది సర్కారు. అంతమాత్రానికే ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం అయినట్టు కాదు. ఇంకా ప్రాసెస్ ఉంది. పాస్ అయిన బిల్లుపైనా గవర్నర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, తమిళిసై ఇంకా ఆ బిల్లును ఆమోదించలేదు.


ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉండటంతో.. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపుతారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాజ్‌భవన్ వర్గాలు ఖండించాయి. ఆర్టీసీ బిల్లును న్యాయ సలహా కోసం న్యాయశాఖకు పంపినట్టు తెలిపాయి. గవర్నర్ సూచించిన సవరణలు, సూచనలు బిల్లులో పొందుపరిచారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకే న్యాయశాఖకు పంపినట్టు చెబుతున్నారు.

ఇక, రాజ్‌భవన్‌లో బిల్లు ఆలస్యం అవుతుండటంతో.. ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి ధర్నాలకు సమాయత్తమవుతున్నాయి.

Related News

Hyderabad Real Boom: రివర్ వ్యూ.. లేక్ వ్యూ.. తేడా వస్తే ‘రోడ్ వ్యూ’.. ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×