TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు.
TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు.
అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.