IAS Arvind: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్కు ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండానే కార్ రేస్కు రూ.50 కోట్లు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్కుమార్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ మున్సిపల్, HMDA కమిషనర్గా పనిచేశారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్కుమార్కు పేరుఉంది. బీహార్ క్యాడర్ అధికారి అరవింద్కుమార్కు నోటీసులు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
క్యాబినెట్, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే.. హైదరాబాద్లో ఫార్ములా–ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకుంది. దాని నిర్వహణ కోసం రూ.54 కోట్లు ముందస్తుగా చెల్లించేసింది. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండానే ఒప్పందాన్ని అతిక్రమించి రేస్ను రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
.
.