EPAPER

TRS: విషం చిమ్మిన మోదీ.. మునుగోడు ఓటమే కారణం :టీఆర్ఎస్

TRS: విషం చిమ్మిన మోదీ.. మునుగోడు ఓటమే కారణం :టీఆర్ఎస్

TRS: హైదరాబాద్ గడ్డ మీదనుంచి పీఎం మోదీ.. కేసీఆర్ సర్కారుకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం తెలంగాణలో రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ప్రజలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టబోమని, అవినీతిపరులతో చేతులు కలిపారని.. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అన్నట్టు మోదీ మాట్లాడారు.


ఇక, మోదీ ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. మునుగోడు ఓటమి అక్కసుతోనే కేసీఆర్‌పై మోదీ విషం చిమ్మారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు హంసలాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేస్తారన్నారు. గుజరాత్‌ ప్రజల్లా తెలంగాణ జనాలు మోసపోరని తెలిపారు. నేతలు, పార్టీలను భయపెట్టి ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మడం మినహా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను అడ్డగోలుగా ఉపయోగించి మునుగోడుపై దాడి చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా.. మునుగోడులో ఓడిపోయామన్న అక్కసు తప్ప మోదీ మాటల్లో కొత్తగా ఏమీ కనిపించలేదన్నారు.


మోదీ ఎప్పుడు వచ్చినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. వడ్డీతో చెల్లిస్తామన్న మోదీ.. ముందు ఇవ్వాల్సిన పైసలు ఇస్తే చాలని.. వడ్డీతో సహా మీరు ఇస్తానన్నది భారత దేశ ప్రజలే మీకు ఇస్తారంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×