Hyderabad: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.
Hyderabad : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.
గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట్, శిల్పా లే అవుట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, బాలానగర్ ఫ్లైఓవర్లు, ఖైతలాపూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ 31 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు వెల్లడించారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘింస్తే.. వారి వివరాలను వాట్సప్ నెంబర్ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.