Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదని తెలంగాణ వ్వవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు అస్సలు పొంతన లేదని.. పంట నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి తుమ్మల ఆగ్రహించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
.
.