Mancherial : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రివేళ సామాగ్రిని తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి వాటి కీస్ తమ వద్ద పెట్టుకున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తెల్లవారుజామున కొందరు క్యాంప్ కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులోని సామాన్లను మూడు, నాలుగు వాహనాలలో తరలించారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ముందుగానే క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు తెలియకుండా సామాన్లను తరలించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.