Nizamabad Kidnap: నిజామాబాద్లో కిడ్నాపైన బాలుడు క్షేమంగా దొరికాడు. ఎట్టకేలకు జీజీహెచ్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు బాలుడు మణికంఠను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. నిజామాబాద్లోని ప్రభుత్వాస్పత్రిలో ఏడాది బాలుడు మణికంఠను కిడ్నాప్ చేశారు. కొంతమంది మహిళలు కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీలో కనిపించారు. అయితే కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రాంతానికి చెందిన పిల్ల రాజు, లక్షిలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. అయితే వీరిద్దరూ ఆస్పత్రిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ముగ్గురు మహిళలు వాళ్లమధ్యన నిద్రిస్తున్న బాలుడు మణికంఠను ఎత్తుకెళ్లారు.
తర్వాత లేచి చూడగా.. బాలుడు కనిపించకపోవడంతో ఆస్పతిలో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో బాలుడు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీలో ఫుటేజీలను తనిఖీలు చేయగా.. ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: ఎయిర్పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం
సీసీ కెమెరాల ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన బాలుడు మణికంఠను ఆ మహిళలు మహారాష్ట్ర తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని పట్టుకున్నారు.