Group 2 Postpone : గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిరుద్యోగ అభ్యర్థులు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు కమిషన్ కార్యాలయం పక్కనే బైఠాయించి ధర్నా నిర్వహించారు.
గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆగస్టు మొదటి తేదీ నుండి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ఒకే నెలలో గ్రూప్ 2 , గురుకుల పరీక్షల వల్ల.. అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు వల్ల 3 నెలలు మానసికంగా చదవలేకపోయామంటున్నారు అభ్యర్థులు. అందుకే, గ్రూప్ 2 పరీక్షను.. మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.