In Telangana 74 more municipal commissioners transferred(Today news in telangana): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు మున్సిపల్ కమిషనర్ల బదిలీల పర్వం కొనసాగుతున్నాయి. మంగళవారం 40 మందిని బదిలీ చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ వెంటనే బుధవారం మరో 74 మందిని ప్రభుత్వం బదితీ చేస్తు ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్ర పురుపాలక శాఖ.. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టింది. ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 105 మంది అధికారులను బదిలీ చేశారు.
సోమవారం జారీ చేసిన ుత్తర్వులతో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేశారు. 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లును తెలంగాణ ఆబ్కారీశాఖలో బదిలి చేశారు. ఇద్దరు ఉప కమిషనర్లతో పాటు 9 మంది సహాయ కమిషనర్లకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 132 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు. వారితో పాటు 32 మంది డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో) లు బదిలీ చేశారు.