Telangana Elections : కాంగ్రెస్కు సీపీఎం కటీఫ్ చెప్పింది.ఈ సారి ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలని వామపక్ష నేతలు నిర్ణయించేశారు. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి సై అంటూ ఏకంగా ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో సీపీఎం పోటీకి దిగనుంది. ఇందులో భాగంగా భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్లో ఎన్నికల బరిలో నిలవనుంది సీపీఎం. అయితే.. అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
చివరి వరకు కాంగ్రెస్ నుంచి ఓ క్లారిటీ వస్తుందని ఎదురు చూశామని.. అయితే తమను హస్తం నేతలు లైట్ తీసుకున్నట్టు కనిపించిందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చివరికి ఒకరోజు టైమ్ అడిగారని.. ఆ సమయం ఇచ్చినా ఏం తేల్చకపోవడంతోనే ఒంటరి పోరుకు రెడీ అయ్యామంటూ ప్రకటించారు .
అయితే సీపీఎం బాటలోనే సీపీఐ నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఒంటరిపోరుపై సీపీఐ నేతలకు తెలిపామన్నారు తమ్మినేని. సీపీఐ నేతలు కూడా త్వరలోనే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పొత్తులపై ఓ ప్రకటన చేసేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్తో పొత్తు కోసం చాలా త్యాగాలకు సిద్ధమయ్యామని.. కానీ వారు దానిని గుర్తించలేకపోయారన్నారు. ఇక తాము నేరుగా పోరాటంలోకి దిగుతామని తెలిపారు తమ్మినేని.