Warangal floods news in telugu(Local news telangana): వరద పోటెత్తడంతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతన నగర్ నగర్ వైపు గట్టు తెగిపోయింది. దీంతో పోతన నగర్, రంగంపేట, భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తోంది. చెరువుకు సమీపంలో ఉన్న కాలనీల్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ భద్రకాళి చెరువును పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుకు గండిపడిన చోట వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది పూడ్చే పనులు చేపట్టారు. ప్రవాహం భారీగా వస్తుండటం ఇబ్బందులు ఎదురువుతున్నాయి.
వరంగల్ మున్సిపల్ కమిషనర్ భద్రకాళి చెరువుకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మున్సిపల్ డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అక్కడకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకు బస్తాలతో గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పోతన నగర్, సరస్వతి నగర్, కాపువాడ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.