Panjagutta accident: హైదరాబాద్లోని పంజాగుట్ట పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను టెంపో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మణుగూరుకి చెందిన ఎస్పీఎఫ్ ఎస్ఐ శంక్రరావు.. సోమవారం ఉదయం తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బేగంపేట నుంచి పంజాగుట్టలోని ఓ ఆసుపత్రికి తీసుకొస్తున్నాడు.
లైఫ్ స్టయల్ షాపింగ్ ప్రాంతానికి రాగానే శంకరావు డ్రైవ్ చేస్తున్న బైక్ను వెనుక నుంచి వచ్చిన టెంపో బలంగా ఢీ కొట్టింది. స్పాట్లో శంక్రరావు కూతురు ప్రసన్న మృతి చెందింది. ఈ ఘటనలో శంకర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: టీపీసీసీ కొత్త చీఫ్గా మహేశ్కుమార్ గౌడ్..నేడో, రేపో ప్రకటన!
ప్రసన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. టెంపో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హాస్పిటల్కు వెళ్తుండగా ప్రమాదం.. కూతురు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద రోడ్డు ప్రమాదం.
బైక్పై వెళ్తున్న తండ్రి కూతుర్లను ఢీ కొట్టిన టెంపో వాహనం.
అక్కడికక్కడే కూతురు ప్రసన్న మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు.
గాయపడిన వ్యక్తి మణుగూరుకు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై… pic.twitter.com/ugk6Pdpa8d
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2024