EPAPER

Telangana Weather Report: మార్చిలో మండుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

Telangana Weather Report: మార్చిలో మండుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!


Telangana Weather Report: ఈ సారి సమ్మర్‌లో ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా మార్చి రెండో వారంలోనే సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. గత ఏడాదితోపోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణాలోని ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల 39డిగ్రీలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మరింత తీవ్రతరం కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.


తెలంగాణాలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తల మడుగులో 40.5 డిగ్రీలు, నల్గొండ లో 40.9 డిగ్రీలు, సిద్ధిపేటలో 40.8, నిజామాబాద్ లో 40.5, నిర్మల్ జిల్లాలో 40.4, జగిత్యాలలో 40.5, సంగారెడ్డి జిల్లాలో 40.3, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.

Also Read: ఇక నుంచి టీజీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.

ఈనేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఎండలు మండి పోతుండటం, ఉక్కపోత, వేడిగాలుల కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ అయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే ఆహారంలో వీలైనంత వరకూ నీటిశాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఏదేమైనా గతేడాది కంటే ఈ ఏడాది  మాత్రం ఎండలు మామూలుగా ఉండవని తెలుస్తోంది. ఇందుకు మార్చి నెలలో సుర్రుమనిపిస్తున్న ఎండలే ట్రైలర్ లా అనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సూరీడు ఇంకెంత నిప్పులు కక్కుతాడో అని ప్రజలు తలచుకుంటేనే భయంగా ఉంటుంది.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×