Telangana : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు వీడటం లేదు. రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల దారులు కనిపించక పోవటంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, మెదక్ లలో చలి తీవ్రత మరింత పెరిగింది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్పేటలో 10.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 11.0 డిగ్రీలు, చౌదరిగూడెంలో 11.2 డిగ్రీలు, షాబాద్ మండలం తాళ్లపల్లిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది.