Nerella Sharada: రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద. గడిచిన కొన్నేళ్లుగా మహిళా కళాశాల విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. వారానికి ఒకటీ రెండు మహిళా కాలేజీలను సందర్శిస్తున్నారామె.
లేటెస్ట్గా మాదాపూర్లోని శ్రీచైతన్య మహిళా కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. నేరుగా కాలేజీకి వెళ్లారు ఛైర్మన్. విద్యార్థుల తరగతుల గదికి వెళ్లారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల వసతిని పరిశీలించారు.
కాలేజీ హాస్టల్, మెస్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ పరిశుభ్రత లేకపోవడంతో ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యం పై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ ఛైర్మన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారామె. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రిజిస్టర్లలను తనిఖీలు చేసి ఎంతమంది విద్యార్థులున్నారని ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఛైర్మన్ నేరెళ్ల శారద.
మాదాపూర్ శ్రీచైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు…!
కాలేజీ హాస్టల్ మరియు మెస్ లో తనిఖీలు నిర్వహించిన నేరెళ్ల శారద.
విద్యార్థులకు హాస్టల్ లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని శ్రీచైతన్య యాజమాన్యంపై నేరెళ్ల శారద ఆగ్రహం… pic.twitter.com/Pr8qAe5PZq
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2024