తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు.
మొత్తంగా 6,500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. నోటిఫికేషన్పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి సబిత.
ఐదేళ్లుగా ఒక్క టీచర్ నోటిఫికేషన్ కూడా వేయకుండా.. ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉండగా.. ఇప్పుడు ఇలా ప్రకటన చేయడంపై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని.. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందే టీఆర్టీ నోటిఫికేషన్ వేసు ఉండేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఖాళీలు భర్తీ చేసేందుకు సర్కారు ముందుకు రావడం సంతోషంగా ఉందంటున్నారు నిరుద్యోగులు.