Muthyampet Sugar Factory : తీపిని పంచె చెరకు రైతుల బ్రతుకులకు చేదును ఇచ్చింది. ఒకప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకి వరంలా ఉండేది. అయితే ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీ మూతపడింది.
ఒకప్పుడు చెరుకు రైతులకి జీవనాధారంగా నిలిచిన.. ఫ్యాక్టరీ మూతపడడంతో అనేక మంది రైతులు ఉపాధి కోల్పోయారు. ఫ్యాక్టరీ తెరవాలంటూ రైతులు , కార్మికులు ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోయారు.
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరిస్తానని కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ప్రకటించడంతో చెరుకు రైతుల ఆశలు చిగురించాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొదటి అసెంబ్లీ సమావేశాల్లనే షుగర్ ఫాక్టరీ గురించి మాట్లాడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాట ఇచ్చారు.