Nukala Naresh Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నూకల నరేష్రెడ్డి ఇక లేరు. వారం కిందట గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం సాయంత్రం చనిపోయారు.
నూకల నరేష్రెడ్డి వయస్సు 65 సంవత్సరాలు. నరేష్రెడ్డి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం. కాంగ్రెస్తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారాయన.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారాయన.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఆయన మరణంపై రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
ALSO READ: కేసీఆర్ కి బిగ్ షాక్.. మూసీ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే