Telangana Postal Ballots | తెలంగాణ ఎన్నికల చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం చేయకముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని ఆదేశించింది.
Telangana Postal Ballots | తెలంగాణ ఎన్నికల చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం చేయకముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని ఆదేశించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించేందుకు అదనపు టేబుళ్లను విడిగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైన తరువాత 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా వెలువడునున్నాయి. చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితాలు వెల్లడిస్తారు. చార్మినార్ మినహా గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లో 16 నుంచి 25 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.