Telangana Polling : తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకూ 8.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. జిల్లాల వారిగా చూస్తే.. ఆదిలాబాద్ లో 13.50 శాతం, భద్రాద్రి 8.33 శాతం, హనుమకొండ – 6.89 శాతం, హైదరాబాద్ – 4.97 శాతం, జగిత్యాల – 10.82%, జనగామ – 9.73%, భూపాలపల్లి – 10.50%, గద్వాల – 12.02%, కామారెడ్డి – 9.98%, కరీంనగర్ – 8.21%, ఖమ్మం- 10.68%, ఆసిఫాబాద్ – 11.64%, మహబూబాబాద్ 10.92%, మహబూబ్నగర్ – 10.21 శాతం పోలింగ్ నమోదైంది.
మంచిర్యాల – 9.37%, మెదక్ – 9.49%, మేడ్చల్ – 5.47%, ములుగు – 11%, నాగర్కర్నూలు – 11.82%, నల్లగొండ – 8.66%, నారాయణపేట్ – 8.85%, నిర్మల్ 9.31%, నిజామాబాద్ – 9.52%, పెద్దపల్లి – 9.84%, సిరిసిల్ల – 10.30%, రంగారెడ్డి – 7.89%, సంగారెడ్డి – 9.94%, సిద్దిపేట – 11.36%, సూర్యాపేట – 9.48%, వికారాబాద్ – 7.87%, వనపర్తి – 11.50%, వరంగల్ – 8.60%, యాదాద్రి – 8.37 శాతం పోలింగ్ నమోదవ్వగా.. మేడ్చల్ లో 2.39 శాతం, నాగర్ కర్నూల్ జిల్లాలో 11.83 శాతం, కామారెడ్డి జిల్లాలో 11 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు.