Telangana Polling: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నిదానంగా వస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. ఉదయం 11 గంటల వరకూ 20.64 శాతం పోలింగ్ నమోదైంది.
ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే.. ఆదిలాబాద్ లో 24.30 శాతం, హైదరాబాద్ లో 10 శాతం, కరీంనగర్ లో 22.62 శాతం, ఖమ్మంలో 24.50 శాతం, మహబూబ్ నగర్ లో 14.64 శాతం, మెదక్ లో 24.30 శాతం, నల్గొండలో 21.92 శాతం, నిజామాబాద్ లో 22 శాతం, రంగారెడ్డిలో 11.64 శాతం, వరంగల్ లో 23.17 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో ఈ సమయానికి దాదాపు అన్ని జిల్లాల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది.