తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ మార్క్ ను దాటి విజయం సాధించింది. మొత్తం 66 సీట్లలో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఆదివారం రాత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై ని కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు.. ఏఐసీసీ అబ్జర్వర్లు దీపాదాస్ మున్షీ, బోసురాజు, అజయ్ కుమార్, ఇన్ ఛార్జి ఠాక్రేతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో.. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. వెంటనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.
ఎన్నికల సంఘం అధికారి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అనంతరం కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.