Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పగా. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పారు. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
వర్ష ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్వస్థలం వనపర్తి జిల్లా వీపన్నగండ్ల గ్రామమని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవటం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
కళాశాల యాజమాన్యం వర్ష డెడ్ బాడీని గుట్టుచప్పుడు కాకుండా గాంధీ ఆసుపత్రికి తరలించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.