Lokesh: లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఐటీ ఉద్యోగులు విశాఖపట్నంకు బయలుదేరారు. హైదారాబాదలో ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు మద్దతు తెలపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టిడీ జనార్ధన్ మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు రక్షణ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు కూడా కనీసం స్వాతంత్య్రం లేదన్నారు. పోస్టులు పెడితే అర్థరాత్రి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేయ్యకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయ్యకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలకు, అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చేందుకే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారన్నారు. అందులో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, జీ వి రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, అమరావతి జేఏసీ కన్నీనర్ కొలకపూడి శ్రీనివాస్, తేజస్వీ పొడపాటి, కొండయ్య చౌదరి మొదలైనవారు పాల్గోన్నారు.