తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.
46 కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రెండు వారాల్లో సమన్లు జారీ చేయాలని సూచించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని తెలిపింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రైల్ దశలో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. 5 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించింది. మూడు నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ కు హై కోర్టు ఆదేశించింది.