EPAPER

Nagarjuna Sagar Project : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. కేసీఆర్ సర్కార్ ఎందుకు స్పందించడంలేదు?

Nagarjuna Sagar Project : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. కేసీఆర్ సర్కార్ ఎందుకు స్పందించడంలేదు?

Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? తెలుగు రాష్ట్రాల మధ్య రెండు రోజులుగా రచ్చ రచ్చ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? మా హక్కులు మేం సాధించుకోవడం తప్పెలా అవుతుందంటూ అటు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొచ్చారు. మా వాటా నీటిని మేం విడుదల చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారాయన.


ఇటు, తెలంగాణలో సాగునీటి మంత్రిత్వ శాఖ కూడా సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది. అయినప్పటికీ ఒక్క మాట కానీ, ప్రకటన కానీ వెలువడకపోవడంపై చర్చ జరుగుతోంది. అటు.. నాగార్జున సాగర్ డ్యాం.. రెండు రాష్ట్రాల పోలీసుల వలయంలో ఉంది. ఏపీ పోలీసులపై తెలంగాణ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారు. మరోవైపు రాజకీయ అవసరాల కోసమే నాగార్జున సాగర్ డ్యాం ఇష్యూని తెరపైకి తెచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×