Telangana Government : రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అలాంటి వారి వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి బుధవారం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.
Telangana Government : రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అలాంటి వారి వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి బుధవారం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.
కీలకశాఖల్లో కీలక స్థానాల్లో రిటైరైన అధికారులు కొనసాగుతున్నారు. ఆయా శాఖలను వారే శాసిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి వారి పేర్లను ప్రస్తావించారు. అలాంటి వారిని తొలగిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే సర్కార్ వారిపై దృష్టి పెట్టింది.
నీటిపారుదల, రోడ్లు-భవనాలు శాఖలతో పాటు.. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో ఉన్నత స్థానాల్లో రిటైరైన అధికారులే ఎక్కువగా ఉన్నారు. నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ శాఖలో 13 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. ఇక రోడ్లు-భవనాల శాఖలో పదిమందికి పైగా పదవీ విరమణ పొందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
విద్యుత్తు శాఖలో అధిక సంఖ్యలో డైరెక్టర్లుగా కీలక స్థానాల్లో ఉన్నారు. జెన్కోలో ఇద్దరు, ట్రాన్స్కోలో నలుగురు, డిస్కంలలో ఆరుగురు రిటైర్డ్ అధికారులే. వీరితో పాటు.. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఎండీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల్లో కూడా చాలామంది పదవీ విరమణ పొందిన వాళ్లే ఉన్నారు. వీరిందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.