Telangana floods: తెలంగాణను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. చాలామంది ఇల్లు కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ.. బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందు కొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు అందులో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ విపత్తు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీన్ని గమనించారు ప్రభుత్వ ఉద్యోగులు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా వర్ణించింది తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ.
ALSO READ: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?
ఇలాంటి సమయంలో తమ వంతు ప్రభుత్వానికి ఆర్ధిక సాయం చేయాలని ముందుకొచ్చింది జేఏసీ. ఇందులోభాగంగా రాష్ట్రంలో ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇవ్వనుంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడించారు.వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొంటామని తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి వరద ప్రాంతాల్లో రెండోరోజూ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో బాధితులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుటుందని భరోసా ఇచ్చారు.
వరద బాధితుల కోసం రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు
వరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల ఒక రోజు వేతనం(రూ.100 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి.#TelanganaFloods #TelanganaRains… pic.twitter.com/QXarO2UWn2
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2024